మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం స్థానిక తాసిల్దార్ కార్యాలయం దుర్గా భవాని క్రియేషన్స్ సమర్పించు “ఇది నిజం ఇదే నిజం” లఘు చిత్రం పోస్టర్ ఆవిష్కరణ ఎమ్మార్వో శ్రీనివాసరావు, భరణి బాబు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది, నేటి ప్రస్తుత కాలంలో జరుగుతున్న సామాజిక అంశాలను కథగా మలచి గొప్ప సందేశాత్మక చిత్రంగా ఈ లఘు చిత్రం రూపొందించారు, ప్రతి వ్యక్తి బాధ్యత కలిగిన వ్యక్తిగా సమాజంలో ఉండాలని సామాజిక బాధ్యత అనేది భౌతికంగా లేకపోయినా వివిధ అంశాలను మేలమించి కథ లో సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ పాత్రలతో కధకు మంచి ప్రాధాన్యతను ఇచ్చారు డైరెక్టర్ తంగెళ్ళపల్లి శంకరాచారి మరియు జి.లక్ష్మణ్ కుమార్ లు , ఎడిటింగ్ దశలో ఈ షార్ట్ ఫిలిం ఉందని త్వరలోనే రిలీజ్ చేయుటకు ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ లఘు చిత్రంలో చర్ల కు చెందిన అశోక్, చంటి, సాయి, వేణు , సతీశ్ తదితర నటి నటులు పాల్గొన్నారు ,ఆవిష్కరణ కార్యక్రమంలో తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది , సీనియర్ జర్నలిస్టు చిన్న పాల్గొన్నారు.