బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో సినీ నటి రియా చక్రవర్తికి, ఆమె కుటుంబ సభ్యులకు పెద్ద ఊరట లభించింది. వీరిపై సీబీఐ జారీ చేసిన లుకౌట్ సర్క్యులరును బాంబే హైకోర్టు రద్దు చేసింది. తాము సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఈ ఆర్డర్పై నాలుగు వారాల పాటు స్టే విధించాలన్న సీబీఐ తరపు న్యాయవాది విన్నపాన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది.
