UPDATES  

 దాతృత్వాన్ని చాటుకున్న నాసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డికి అభినందనలు…

  • దాతృత్వాన్ని చాటుకున్న నాసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డికి అభినందనలు..
  •  దీర్ఘకాల వ్యాధిగ్రస్తుడుకి రూ” పదివేల ఆర్థిక సహాయం అందించిన నాసీరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్.

మన్యం న్యూస్, మంగపేట.

 

మానవసేవే మాధవ సేవ అని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు మంగళ వారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్న చెట్టుపల్లి వెంకటేశ్వర్లు (బొంబాయి) వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రూ” పదివేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సాంబశివరెడ్డి మాట్లాడుతూ గడచిన మూడు సంవత్సరాలుగా వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ నాసిరెడ్డీ విజయభాస్కర్ రెడ్డి అనేక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించటం అభినందనీయమన్నారు. వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ ద్వారా మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సాంబశివరెడ్డి ఆకాంక్షించారు. పేద దళిత కుటుంబమైన చెట్టు పెళ్లి వెంకటేశ్వర్లు (బొంబాయి) కుటుంబానికి ఈరోజు సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు ఈ పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సాంబశివరెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్టు గౌరవ సలహాదారునాసిరెడ్డి నాగిరెడ్డి గ్రామస్తులు కటుకూరి శేషయ్య తొండపు సంజీవరెడ్డి నాసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి లక్ష్మారెడ్డి షేక్ మోయునుద్దిన్ ధూళిపాల బాలకృష్ణ ఎలగొండ సమ్మయ్య దూలగొండ నారాయణ శెట్టిపల్లి నరసింహారావు శెట్టిపల్లి రాజు మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !