ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను పెళ్లి పీటలెక్కనున్నారు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోనుతో తాప్సీ గత పదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇక వీరిద్దరి వివాహానికి ఉదయ్పూర్ వేదిక కానుంది. ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరవుతారని, సినీ తారలు ఎవరూ హాజరుకావడం లేదని తెలుస్తోంది. సిక్కు, క్రైస్తవ పద్ధతుల్లో వీరి వివాహం త్వరలోనే జరగనుందని టాక్.
