UPDATES  

 మన్యంలో వెలిసిన వాణి మూత్యం…గురుకల ఉద్యోగాలలో అరుదైన రికార్డు..

  • మన్యంలో వెలిసిన వాణి మూత్యం.
  • గురుకల ఉద్యోగాలలో అరుదైన రికార్డు
  • గ్రామానికి పేరు తెచ్చినందుకు గ్రామస్థులు అభినందనలు

మన్యం న్యూస్ కరకగూడెం:

ఒక్క ఉద్యోగం కోసం అనేకమంది విద్యార్థులు లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో సంవత్సరాల పాటు కోచింగ్ లు తీసుకున్న ఉద్యోగాలు సాధించలేని పరిస్థితి ఈ కాలంలో నెలకొంది. ఒక్క ఉద్యోగం వస్తే చాలు జీవితాంతం తన కుటుంబం భరోసాతో బతుకుతుందని ఆశతో అనేకమంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న ఈ ప్రపంచంలో ఉద్యోగం రావాలంటే చాలా కష్టం. కాని ఒకే సారి నాలుగు ఉద్యోగాలు(జూనియర్ లెక్చరర్, టీజిటీ -ఇంగ్లీష్, టీజిటీ – మ్యాస్, పిజీటీ – ఇంగ్లీష్) వచ్చాయంటే నమ్మశక్యంగా అనిపించదు. అదికూడా ఏజెన్సీ ప్రాంతంలో కూలీ పని చేసే ఇంట్లో ఆడబిడ్డకు ఇటువంటి అరుదైన అవకాశం వచ్చింది.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి పినపాక నియోజకవర్గ పరిధిలోని కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మలకం రమాదేవి చదువుతున్న సమయంలో తండ్రిని కోల్పోయింది. తమ్ముడు రవి, తల్లి సరోజన ప్రోత్సాహంతో ఎన్ని కష్టాలు వచ్చినా చదువును విడవకుండా పట్టుదలతో, అకుంటితదీక్షతో తన చదువును కొనసాగించింది. భద్రాచలం ఏజెన్సీ బిఎడ్ పూర్తి చేసుకొని ఉద్యోగమే లక్ష్యంగా చదువుకుంది.కరకగూడెం,అనంతారం గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యవాలింటర్ గా విద్యను అభ్యసించి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గురుకుల ఫలితాల్లో పిజి మరియు

జెఎల్ లు ఏకకాలంలో ఉద్యోగాలు సాధించింది.

ఒకేసారి రమాదేవి నాలుగు ఉద్యోగాలు రావడంతో గ్రామ ప్రజలు ఆమెను అభినందిస్తు

ఇష్టపడి చదివితే ఎవరైనా ఉద్యోగాలు సాధించవచ్చునని, అందుకు నిదర్శనం మల్కం రమాదేవి అని అన్నారు. ఆదివాసి బిడ్డను ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది అనేక ఉన్నత శిఖరాలు సాధించేందుకు ముందడుగు వేయాలని, ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత పొందిన రమాదేవిని అభినందించారు.అలాగె గొల్లగూడెం మాజీ సర్పంచ్ ఇర్ప.విజయ్ కుమార్ భార్య స్వప్న గురుకుల పాఠశాలలో లైబ్రరీ ఉపాద్యాయురాలుగా ఎన్నకైనందున అమేను కూడా గ్రామ ప్రజలు అభినందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !