మన్యం న్యూస్, మంగపేట.
శనివారం మంగపేట మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ సిద్ధంశెట్టి వైకుంఠం తల్లి జయలక్ష్మి ఇటీవలే మృతి చెందగా వారి కుటుంబ పరామర్శించిన ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమార్రి లక్ష్మణ్ బాబు.
మంగపేట మండలం నర్సింహాసాగర్ గ్రామ పంచాయితీలోని శనగకుంట లో పెద్దల దేవేందర్ కీ చెందిన ఇల్లు ఇటీవలే అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు.
భాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి 10వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. గుండె ఆపరేషన్ చేసుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆరెళ్ల దేవెందర్ ను పరామర్శించి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని సూచనలు చేశారు. మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య కుమారుని వివాహం ఇటీవల జరగగా వారి ఇంటికి వెళ్లి నూతన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ,సొసైటీ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం ,జిల్లా నాయకులు, పచ్చ శేషగిరిరావు,తాటి కృష్ణ , కూర్బన్ అలీ, చిట్టీమల్ల సమ్మయ్య, మండల మహిళా అధ్యక్షురాలు గోస్కుల లక్ష్మి పార్వతి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు తోలెం నర్సింహరావు , నర్సింహాసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉడుగుల శ్రీనివాస్ యాదవ్ ,మండల నాయకులు, కాకులమర్రి భాస్కర్ బాబు, తదురు రఘు,మెరుగు వెంకటేష్, రానప్రతాప్ రెడ్డి ,నరేందర్, రథంసింగ్, డా :సమ్మయ్య, జనార్దన్ , చిప్ప నాగరాజు, గుడిసెవా నాగేశ్వరావు,యూత్ నాయకులు గౌని రమేష్,, శేఖర్,ఫిరోజ్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి ,తదితరులు పాల్గొన్నారు.