నిఖిల్ హీరోగా డైరెక్టర్ చందూ మొండేటి 2014లో సస్పెన్స్ థ్రిల్లర్కి మైథాలజీ కాన్సెప్ట్ జత చేసి ‘కార్తీకేయ’ మూవీని తెరకెక్కించారు. ఇక దీనికి సీక్వెల్గా 2022లో వచ్చిన కార్తీకేయ-2 కూడా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించింది. త్వరలో ‘కార్తీకేయ-3’ కూడా రాబోతోందని తాజాగా హీరో నిఖిల్ పోస్ట్ పెట్టారు. ‘డాక్టర్ కార్తీకేయ కొత్త అడ్వెంచర్ని వెతుకుతున్నాడు’ అని ఆయన చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
