రహదారిని బాగు చేయండి సారు
మన్యం న్యూస్ గుండాల: సాయనపల్లి నుండి దామరతోగు వరకు రహదారిని బాగు చేయండి సార్ అంటూ ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర అధికారులను డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాల నుండి రహదారి అధ్వానంగా ఉన్న ఏమాత్రం అధికారులు పట్టించుకోవటం లేదని ఆయన పేర్కొన్నారు. మేడారం జాతర సమయంలో తూతూ మంత్రంగా అధికారులు మరమ్మతులు చేశారే తప్ప సరిగా లేవని అన్నారు. గుండాల మణుగూరు ప్రధాన రహదారి కనుక రహదారి మరమ్మతులను తక్షణమే చేయాలని కోరారు రహదారి మార్గమధ్యలో పెద్ద గోయిని కూడా పూడ్చాలని కోరారు