మన్యం న్యూస్ గుండాల: ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సంస్థ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరం రైతు వేదికలో 108 సిబ్బందికి శిక్షణ తరగతులను సంస్థ నిర్వహించింది. అత్యవసర సేవలు అందిస్తున్న ఈ ఎం టి లకు ప్రధమ చికిత్స పై తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులలో ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన పరమ ఆకాష్, అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకు సర్టిఫికెట్ను అందుకున్నారు
