విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా, అరుణాచల్ప్రదేశ్ తమ భూభాగమే అంటూ చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. అరుణాచల్ ప్రదేశ్పై చైనా చేసిన అసంబద్ధమైన వాదనలు పూర్తిగా నిరాధారామైనవని భారత్ స్పష్టం చేసింది. ఆ ఈశాన్య రాష్ట్రం గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భారత్లో భాగంగానే ఉంటుందని స్పష్టం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలతో అరుణాచల్ ప్రజలు భవిష్యత్తులోనూ లబ్ధి పొందుతారని తెలిపింది.
