దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ముంబైలో మంగళవారం నీటిలో 15 శాతం కోత ఉంటుందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. థానే జిల్లాలో గల పైస్ డ్యామ్లో తగినంత నీటిమట్టం లేదని, అందుకోసమే అదనంగా నీటి కోత విధించాల్సి వస్తోందని బీఎంసీ అధికారులు తెలిపారు. దీంతోపాటు ఇప్పటికే 5 శాతం కోత అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
