దేశంలో యూరియా కొరత లేకుండా చేసేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఏడాది పాటు యూరియాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ‘ఇండియా పొటాష్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో ప్రభుత్వ అకౌంట్ ద్వారా యూరియా దిగుమతులు జరగనున్నాయి. ఈ మేరకు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
