- గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తా
- ఖమ్మం అభివృద్ధికై నన్ను గెలిపించండి
- నాకు ఓటు వేస్తే మోడీకి వేసినట్టే
- -ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి తాండ్ర వినోద రావు
మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 04: ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికై బిజెపి అభ్యర్థి అయిన నన్ను గెలిపించాలని తాండ్ర వినోద రావు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ప్రచారంలో భాగంగా అభ్యర్థి తాండ్ర వినోద రావు, వారి బృందం అశ్వారావుపేట కు చేరుకున్న సందర్భంగా జంగారెడ్డిగూడెం రోడ్ లోని రంగా ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ దేశంలో రామరాజ్యాన్ని మరిపిస్తున్న మోడీ పాలనకు ప్రజలంతా మద్దతుగా నిలుస్తున్నారని, దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న మోదీ నాయకత్వాన్ని ప్రజలంతా అంగీకరిస్తున్నారని, జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా నాకు ఓటు వేసి గెలిపించాలని, నాకు ఓటు వేస్తే మోడీకి వేసినట్టేనని, ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకువచ్చినా వాటిని అమలు చేయడంలో గత ఎంపీలు చిత్తశుద్ధితో అమలు చేయలేదని, పరిపాలనలో ఉన్నవారు పట్టించుకోలేదని, అనేక ప్రాజెక్టులు కేంద్రం నుంచి వచ్చినప్పటికీ వాటిని ప్రక్కదోవ పట్టించారని, అందుకే ఈ ప్రాంతమంతా అభివృద్ధిలో వెనకబడి ఉందని, బిజెపిని గెలిపిస్తే మరింత అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని, అనేక సంక్షేమ పథకాలను, అనేక ప్రాజెక్టులను, తీసుకువచ్చిన ఘనత బిజెపి పార్టీదేనని, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ టి పి సి ని జాతికి అంకితం చేసిన పార్టీ బిజెపి అని, ఈ దేశం రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలంటే బిజెపి నీ మరల మూడవసారి అధికారంలోకి తీసుకురావాలని, ప్రజలు కూడా బిజెపి పాలన కోసం చూస్తున్నారని, నన్ను ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా గెలిపిస్తే గిరిజన యూనివర్సిటీ ని తీసుకువస్తానని, ఈ ప్రాంతంలో గిరిజనులకు బడుగు బలహీన వర్గాల వారికి అనేక అవకాశాలు దక్కుతాయని వారన్నారు. ఈ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవసరం ఉన్నాయని, వాటిని కూడా ఈ ప్రాంతానికి సాధిస్తానని, ఈ ప్రాంతంలో సమస్యల కంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ అవకాశాలతో సమస్యలను పరిష్కరించుకోవచ్చని, ఎన్నికలకు నలబై రోజుల సమయం ఉన్నదని, ఈ నలభై రోజులు కష్టపడితే ఐదు సంవత్సరాలు మీ సేవకుడిగా పని చేస్తానని, ఈసారి ఎన్నికలలో ఖమ్మం పార్లమెంటు నియోజవర్గంలో కమలం వికసించబోతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పార్టీల వలే ఐదు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు కాకుండా మోడీ గ్యారెంటీతో పనిచేస్తున్నామని, సమస్యలన్నింటినీ గుర్తుపెట్టుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, కావున బిజెపి అభ్యర్థిగా నన్ను గెలిపించాలని తాండ్ర వినోద రావు మండల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వినర్ గొట్టిముక్కల శ్రీనివాసరావు, అసెంబ్లీ ప్రభారీ గాదె రాంబాబు, పార్లమెంట్ ప్రాభారి శ్రీకాంత్, పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మడివి రవి, జిల్లా మహిళా మోర్చ కార్యదర్శి మద్దాల దేవి, మరియ అశ్వారావుపేట మండల అధ్యక్షులు బండారు చందు, దమ్మపేట మండల అధ్యక్షులు జుజ్జురి చెన్నారావు, ముల్కలపల్లి మండల అధ్యక్షులు అనుముల శ్రీను, అన్నపురెడ్డి పల్లి మండల అధ్యక్షులు బాల కిరణ్, చండ్రుగొండ మండల అధ్యక్షులు బోగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.