మన దేశంలోని ఆఫీస్లలో అధిక శాతం ఉద్యోగులు ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 92% మంది నిపుణులు ఏఐని వినియోగిస్తున్నట్లు తాజాగా ‘మైక్రోసాఫ్ట్, లింక్డిన్ 2024 వర్క్ ట్రెండ్ ఇండెక్స్’ నివేదిక వెల్లడించింది. ప్రపంచ సగటు 75 శాతం మాత్రమే కావటం గమనార్హం. ఏఐ వినియోగం వల్ల సమయం ఆదా అవుతుందని, సరికొత్త సేవలు ఆవిష్కరించే అవకాశం కలుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
