రాష్ట్రంలో సీ ప్లేన్ టూరిజానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని అమల్లోకి తీసుకురానుంది. జలవనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ హౌస్ బోట్లతో సీ ప్లేన్ టెర్మినల్ను పర్యాటక శాఖ నిర్మించనుంది. విజయవాడ, కాకినాడ, రుషికొండ, లంబసింగి, కోనసీమ, విశాఖ ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలు అందించనుంది. 9-10 మంది సామర్థ్యంతో కూడిన 2 ఫ్లోటింగ్ ప్లేన్లు రోజూ నడవనున్నాయి.
