UPDATES  

 విద్యావంతుడు రాకేశ్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం (మే,22)::

విద్యావంతుడు,మేధావి అయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి రాకేష్ రెడ్డి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించే విధంగా చైతన్య పరుస్తూ ఆయన గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పని చెయ్యాలి అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు,మాజీ ప్రభుత్వ విప్,మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు.బుధవారం దుమ్ముగూడెం మండల కేంద్రం లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ “రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో అమలు కానీ వాగ్దానాలతో గద్దె ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మండలంలో అత్యధిక మెజారిటీ ఇచ్చిన ప్రజలకు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.నిరుద్యోగుల సమస్యలు పట్ల పూర్తి అవగాహన ఉన్న మన అభ్యర్ధి రాకేష్ రెడ్డి అత్యంత మెజారిటీ తో గెలిపించాలని,అవినీతి పరుడు అయిన తీన్మార్ మల్లన్నకు తగిన బుద్ధి చెప్పే విధంగా కార్యకర్తలు పట్టభద్రుల ను చైతన్యం చేసి రాకేష్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మానే రామకృష్ణ,రావులపల్లి రాం ప్రసాద్,మండల అధ్యక్షులు అన్నె సత్యనారాయణ మూర్తి,కార్యదర్శి కణితి రాముడు, ఎంపీపీ రేసు లక్ష్మి,అధికార ప్రతినిధి ఎండీ జానీ పాషా,ఉపాధ్యక్షులు తునికి కామేష్, సీనియర్ నాయకులు సీతారామారావు మోత్కూరు శ్రీకాంత్ అల్లాడి వెంకటేష్ జయసింహ రామిరెడ్డి గంగరాజు మాజీ సర్పంచులు జ్యోతి ,సీతారాం తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !