UPDATES  

 ఆదరించి గెలిపించండి పట్టభద్రుల గలం మండలిలో వినిపిస్తా..

మన్యం న్యూస్ గుండాల: ఆదరించి గెలిపించండి పట్టభద్రుల గలం మండలిలో వినిపిస్తానని వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి తేజావత్ వాసుదేవ్ నాయక్ శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 34 ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించగలరని విజ్ఞప్తి నేను గెలిస్తే నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా కేంద్రాల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను. నిరుపేద గ్రాడ్యుయేట్ విద్యార్థి కోచింగ్ తీసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉద్యోగం కొట్టాలంటే కష్టం అవుతుంది ఉన్నత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు హైదరాబాదులలో ఢిల్లీలో పెద్దపెద్ద కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు కట్టి కోచింగ్ తీసుకుంటున్నారు వారు మాత్రమే కాంపిటీటివ్ ఎగ్జామ్ లో నెక్కుతున్నారు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కానీ పేద వారి విద్యార్థుల గురించి ఆలోచించి వారు లేరు అందుకే పేద ప్రజల గొంతుకనై శాసనమండలిలో వారి పక్షాన పోరాడుతానని అందరికీ సమ న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇస్తున్నాను అందుకే పట్టభద్రులారా ఉపాధ్యాయులారా ఉద్యోగులరా నాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !