UPDATES  

 జీలుగు విత్తనాలు పంపిణీ.. 30కిలోల బస్తా ధర 1116/-..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం (మే 28)::

మండల కేంద్రంలోనీ దుమ్ముగూడెం సహాయ సహకార సంఘం అధ్వర్యంలో రైతులకు జిలుగు విత్తనాలు పంపిణీ మంగళవారం అధ్యక్షులు కిమిలి ఎల్లారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన తెలుపుతూ.. రైతులకు వ్యవసాయ శాఖ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పై జిలుగు విత్తనాలను ఇవ్వడము జరుగుతుందని, జిలుగు 30 కిలోల బస్తకు ధర 2790/- సబ్సిడీ1674/- కానీ రైతు రూ.1116/-చెల్లించి, ఆధార్ కార్డు, పాస్ పుస్తకం జిరక్స్ తీసుకొని రావాలని,2.20 ఎకరాకు ఒక బస్తా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు .రైతులందరూ ఈ సబ్సిడీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో రైతులు కొడాలి లోకేష్ రామకృష్ణ నరసింహారావు సంఘ సీఈవో ముత్తయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !