లోక్సభకు ఈసారి 280 మంది తొలిసారిగా ఎన్నికయ్యారు. వారిలో మాజీ ముఖ్యమంత్రులు, సినీనటులు, రాజకీయ కార్యకర్తలు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్ నుంచి 45 మంది తొలిసారిగా లోక్సభలో అడుగుపెడుతున్నవారే. వారిలో టీవీ రాముడు అరుణ్ గోవిల్, కాంగ్రెస్ నేత కిశోరీలాల్ శర్మ, దళిత హక్కుల ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 33 మంది కొత్తవారే.