UPDATES  

 మదుపరులకు NSE హెచ్చరిక..!

డీప్‌ఫేక్‌ వీడియోలతో జాగ్రత్తగా ఉండాలని మదుపరులను ఎన్‌ఎస్‌ఈ హెచ్చరించింది. ఈ క్రమంలోనే తమ ఎండీ, సీఈవో ఆశిశ్‌కుమార్‌ చౌహాన్‌ పెట్టుబడి సలహాలను ఇస్తున్నట్టు వస్తున్న ఆడియో, వీడియో క్లిప్‌లను నమ్మవద్దని.. అవన్నీ మోసపూరితమైనవేనని ఓ ప్రకటనలో పేర్కొన్నది. అలాంటి తప్పుడు వీడియోలు ప్రసారం కాకుండా చూడాలని వివిధ సామాజిక మాధ్యమాలకూ విజ్ఞప్తి చేసింది. మదుపరులకు తాము ఏదైనా సమాచారం ఇవ్వాలనుకుంటే తమ అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే ఇస్తామని కూడా స్పష్టం చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !