రియాసీ ఉగ్రదాడి కేసును కేంద్ర హోంమంత్రిత్వశాఖ NIAకు అప్పగించింది. ఈ ఘటనపై ఉపా చట్టం కింద NIA కేసు నమోదు చేసింది. కాగా ఇటీవల శివ్ఖోరీ ఆలయం నుంచి మాతా వైష్ణవిదేవి గుడికి బయల్దేరిన బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. 33 మంది గాయపడ్డారు.