మన్యం న్యూస్, దుమ్ముగూడెం జూన్ 18::
దుమ్ముగూడెం మండలంలో నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షించుటకు నూతన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉదయం 8.30గంటలకు వస్తున్నారని, రానున్న వర్షాకాల సీజన్లో వరద ప్రభావిత ప్రాంతంలో పరిశీలించి పలు సూచనలు తెలియజేస్తారని కావున అధికారులు ఎంపీడీవో, ఎంపీవో, ఎంఈఓ ,సిఐ పోలీస్ ఏఈ ట్రాన్స్కో, హెల్త్ డిపార్ట్మెంట్ ,సిడిపిఓ ,ఇరిగేషన్ ఆఫీసర్స్ ,ఈవో పర్ణశాల సంబంధిత అధికారులు సకాలంలో హాజరై కలెక్టర్ పర్యటన విజయవంతం చేయవలసిందిగా మండల తాసిల్దార్ చంద్రశేఖర్ కోరారు.