మన్యం న్యూస్ ,దుమ్ముగూడెం జూన్ 18::
మండల పరిధిలోని నారాయణరావు పేట గ్రామపంచాయితీ పౌలూరిపేట, గంగారాం ప్రాంతంలో ఉన్న తులసమ్మ చెరువు కాలువ పూడిక పనులు ప్రారంభించాలి అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు, రైతులు డిమాండ్ చేసారు.మంగళవారం ఆ చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన వారు మాట్లాడుతూ.. తులసమ్మ చెరువు 2013 ముందు నిర్మించారని ఈ చెరువు కింద సుమారు 300 ఎకరాల రైతులకు నీరు వారి పంట సాగు అందుతుంది కానీ గత కొంత కాలంగా కాలువ పూడిక పనులు తీయక నీళ్లు రావడం లేదూ అని అధికారులకు ఎన్నీ సార్లు తెలిపిన పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. నూతన ప్రభుత్వం అయిన చెరువు మరమ్మతు పనులు చేపట్టి రైతులు ఆదుకోవాలి అని ప్రభుత్వ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయన్న, రైతులు ముత్తయ్య, ఈశ్వర్, సాగర్ తదితరుల పాల్గొన్నారు .