మన్యం న్యూస్ గుండాల: రైతన్న సాగు బడి కాలం వచ్చినప్పటికీ తొలకరి పలకరించకపోవడంతో రైతన్నలు ఆందోళన మొదలైంది. శుక్రవారం తెల్లవారుజాము నుండి తొలకరి చినుకు పలకరించడంతో రైతన్నలో ఆనందం మొదలైంది. ఇప్పటికే సిద్ధం చేసుకున్న రైతన్న సాగు బడికి సంసిద్ధమయ్యాడు లేటుగా పలకరించినప్పటికీ సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు