మన్యం న్యూస్ గుండాల: వ్యవసాయ కూలీలకు కనీస వేతనం 600 చెల్లించాలని కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బొర్రా వెంకన్న డిమాండ్ చేశారు. శుక్రవారం గుండాల తాసిల్దార్ ఇమ్మానియేల్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిజెపి పదేళ్ల పాలనలో వ్యవసాయ కూలీల సంక్షేమాన్ని అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. కార్పొరేట్ ధనవంతులకు 30 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు తప్ప పేద ప్రజలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. పేద ప్రజలకు అవసరమయ్యే విద్య, వైద్యం, పెన్షన్ కొరకు నిధులను మాత్రం కేటాయించడం లేదని అన్నారు. కార్మిక రంగాన్ని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ నాయకులు ఈసం శంకర్, కొమరం శాంతయ్య, వాంకుడోత్ అజయ్, పూణేం లక్ష్మయ్య, జగన్, తదితరులు పాల్గొన్నారు
