మన్యం న్యూస్ అశ్వర్రావుపేట
అశ్వరావుపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ అదృశ్యమయ్యారు. వివరాల్లోకి వెళితే ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లిన ఎస్సై రాత్రి 10.00 గంటలైనా స్టేషన్ కి తిరిగి రాకపోవడంతో . సిఐ గా విధులు నిర్వహిస్తున్న జితేంద్ర తన ఇంటి వద్ద గాలించిన ఆచూకీ దొరకలేదు, అని తెలుస్తోంది , ఎస్సై వద్ద ఉన్న రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి .స్థానిక సీఐ జితేంద్ర ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు.అని సమాచారం, రక్షించాల్సిన రక్షక భటులే అదృశ్యమైతే సామాన్య ప్రజల మాటేమిటి అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఎస్ఐ అదృశ్యంతో అశ్వరరావు పేట లో భయానక వాతావరణం నెలకొంది.