‘‘సుమారు 10ఏళ్ల క్రితం నేను, ప్రియాంక, స్వప్న ముగ్గురం కలిసి తీసిన మా తొలి చిత్రం వర్షం కారణంగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ షూటింగ్ రద్దు అయ్యి, మళ్లీ సెటప్ వేయాల్సి వచ్చింది. దానికి అదనంగా చాలా ఖర్చు అవ్వడంతో చాలా భయమేసింది. ఇప్పుడు మా ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తున్నాయి. ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు’’ అని నాగ్ అశ్విన్ రాసుకొచ్చారు.
