UPDATES  

NEWS

టెట్ ఫీజును వెంటనే తగ్గించాలి..200 నుండి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం.. మాతృ అభయ పౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్, పరీక్ష సామాగ్రి, ఆట వస్తువులు పంపిణీ… కరకగూడెంలో అగ్రిటెక్ శాఖ ప్రారంభం…అధునాతన పరికరాలతో రైతులు సాగు చేయాలి.. ఈసం వారి ఇలవేల్పు దూలుగొండ తల్లి జాతర ప్రారంభం.. ఘనంగా ప్రారంభమైన లక్ష్మీదేవి జాతర.. మద్యం తాగి వచ్చాడు…. సస్పెండ్ అయ్యాడు.. ఫోన్ పోయింది…. పోలీస్లు పట్టారు..బాధితునికి అందజేసిన సీఐ రాజువర్మ.. మానవత్వం చాటిన మాలమహానాడు…నిరుపేద రోగికి వితరణ చాటడం అభినందనీయం… – డిప్యూటీ తహసీల్దార్, బీరవెల్లి భరణి బాబు. రామకృష్ణ స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీ నాగులమ్మ కు ప్రత్యేక అభిషేకాలు… వేలం పాట ముగిసింది…

 వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉంది : టిడిపి నాయకులు శ్రీరామినేని జయరాం నాయుడు

(విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రీరామినేని జయరాం నాయుడు)

కె. ఈశ్వర్ – ప్రత్యేక ప్రతినిధి

అన్నమయ్య జిల్లా

వైసిపి పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని టిడిపి నాయకులు శ్రీరామినేని జయరాం నాయుడు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక సీనియర్ నాయకుడైన చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై కరెంట్ ఆఫ్ చేసి రాళ్లు రువ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. నిన్న 2 సెంట్ల భూమి వ్యత్యాసం ఉందన్న నెపంతో అయ్యన్నపాత్రుడు ని రాత్రికి రాత్రి కనీసం చెప్పులు కూడా వేసుకుని ఇవ్వకుండా అరెస్టు చేయడం చూస్తుంటే ఇది రాక్షస పాలన అని స్పష్టంగా అవగతమవుతుందన్నారు. రెండు సెంట్ల కోసం కోసం అంత యాగీ చేసిన వైసిపి నాయకులు రెండు వేల ఎకరాలు, మూడు ఎకరాలుకబ్జా చేస్తుండటం ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే కాలంలో వైకాపాకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా రాజరిక పాలన కొనసాగుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !