UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ

తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం ముగిసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో రాహుల్ గాంధీ ముగింపు సభ నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో చాలా మందితో మాట్లాడానని, రాష్ట్ర ప్రజలను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఈరోజు భారత్ జోడో యాత్ర తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ప్రవేశిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లడం బాధాకరం – రాహుల్ తెలంగాణలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. ఇది రేపటి నుంచి మహారాష్ట్రలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో రాహుల్ యాత్ర వీడ్కోలు సభ జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్ భావోద్వేగానికి గురయ్యారు.

రాష్ట్రం విడిచి వెళ్లడం బాధాకరమని… రాష్ట్రంలో కార్మికులు అద్భుతంగా పనిచేస్తున్నారని రాహుల్ వెల్లడించారు. మీడియాలో చూపించినా చూపకున్నా కళ్లారా చూస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో తనను కలిసిన ఒక్క రైతు కూడా సంతోషంగా లేడన్నారు. తెలంగాణ వాణిని ఒక చోట అణిచివేస్తే మరో ప్రాంతం నుంచి వినిపిస్తుందని, దానిని ఎవరూ అణచలేరన్నారు. ఇక్కడ చేసిన పాదయాత్రను ఎప్పటికీ మరిచిపోలేనని రాహుల్ అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !