UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 వైరస్‌లతో మనిషి సహజీవనం చేయాల్సిందే.!

వైరస్‌లతో మనిషి సహజీవనం చేయాల్సిందే.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కుప్పలు తెప్పలుగా వైరస్‌లు వున్నాయి. వాటిల్లో కొన్ని మాత్రమే మనిషికి హాని చేస్తాయి. అందులోనూ చాలా కొన్ని మాత్రమే ‘కరోనా వైరస్’ తరహాలో ప్రపంచాన్ని వణికించగలవు. మనిషికి తెలిసిన వైరస్‌లు చాలా చాలా తక్కువ. తెలియనివే చాలా చాలా ఎక్కువగా వున్నాయంటారు పరిశోధకులు. తాజాగా ఓ వైరస్‌ ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వయసు ఏకంగా 45 వేల ఏళ్ళట. అయితే, ఇన్నేళ్ళుగా అది నిద్రాణంలోనే వుంది. అదిప్పుడు మేల్కొంది. అది కూడా మనిషి చేస్తున్న పాపం వల్లనే. రష్యాలోని మంచులా మారిపోయిన ఓ సరస్సు అడుగు భాగాన ఈ వైరస్‌ని కనుగొన్నారు.

జాబీ వైరస్.. ప్రపంచాన్ని ఏం చేస్తుంది.? భూమి ఉష్ణోగ్రత పెరుగుతోంది. దానిక్కారణం మనిషి. అడవుల్ని నరికేస్తున్నాడు.. ఇంకేవేవో చేస్తున్నాడు. ఈ కారణంగానే భూమ్మీద మంచు వేగంగా కరిగి పోతోంది. ఆ మంచు కింద మనిషికి తెలియని ఎన్నో సీక్రెట్స్ వున్నాయి. అవి క్రమంగా బయట పడుతున్నాయి. తాజాగా ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు కనుగొన్న జాంబీ వైరస్ కూడా ఆ మంచు కింద కప్పివేయబడిందే. ఆ వైరస్ గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఆ వైరస్ గనుక జంతువులకు లేదా పక్షులకు సోకితే.. ప్రపంచానికి పెను ప్రమాదమేనని అంటున్నారు. పాండోరా వైరస్ అని ప్రస్తుతానికి దీన్ని పిలుస్తున్నారు. జాంబీ వైరస్ అని కూడా అంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !