UPDATES  

 తెలంగాణకు అమరరాజా పై నాయుడు స్పందన

ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ కి చెందిన సంస్థ అమరరాజా గ్రూప్ తెలంగాణలో 9500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీ ఎంపీ అయి ఉండి తెలంగాణలో ఈ పెట్టుబడి పెట్టడం పట్ల వైకాపా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ ఈ విషయమై సమాధానం చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయం లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ఏపీ లో పుట్టిన సంస్థ చిత్తూరు వదిలి రాష్ట్రం వెలుపల పెట్టుబడి పెట్టేందుకు వెళుతుంది. ;\
గతంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన భూములను వెనక్కు తీసుకోవడం వల్లే ఆ సంస్థ తెలంగాణకు వెళ్లిందని.. ఉపాధినిచ్చే పరిశ్రమను ఇలా చేయడం సరికాదంటూ కోర్టు తప్పు పట్టిన కూడా అధికార పార్టీ యొక్క పద్ధతి మార్చుకోలేదని రాజకీయ కక్షతో ప్రజల యొక్క ప్రయోజనాలను, రాష్ట్ర ప్రతిష్టను పనంగా పెట్టారు అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ ప్రత్యర్థి యొక్క యొక్క సంస్థ అనే కారణంతోనే ఆ సంస్థను ఏపీలో పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం మోకాలు అడ్డింది అంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !