UPDATES  

 దొంగల భరతం పడుతాం వరుస చోరీ ఘటనల పై ప్రత్యేక సమావేశం

దొంగల భరతం పడుతాం
వరుస చోరీ ఘటనల పై ప్రత్యేక సమావేశం
*అనుమానాస్పద వ్యక్తుల సంచారం 100 కి ఇవ్వండి:ఎస్సై జితేందర్
*స్వచ్ఛందంగా సీసీ కెమెరా ల ఏర్పాటుకు పలువురు వ్యాపారస్తుల ముందడుగు
* కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ మర్రి మల్లారెడ్డి
మన్యం న్యూస్,అశ్వాపురం:దొంగల భరతం పడుతాం అని మొండికుంట ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు భీష్మించారు.
మండలంలోని మొండికుంట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అధ్యక్షతన మంగళవారం గ్రామపంచాయతీలో జరుగుతున్న వరుస దొంగతనాల నివారణ చర్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అశ్వాపురం ఎస్సై జితేందర్ మాట్లాడుతూ మండలం లోని చుట్టుపక్కల గ్రామాల్లోని కొంతమంది యువకులు అక్రమ సంపాదనకు,ఈజీ మనీకి అలవాటై ప్రజలను ఇబ్బంది పెడుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇకనైనా అలాంటి వ్యక్తులు నేరచరిత పనులు మానుకోవాలని లేనిపక్షంలో కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉన్నారని, పోలీసులకు ప్రజలు సహకరించాలని గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే (100)తెలియజేయలని కోరారు. గ్రామంలో రోజు పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు.
స్వచ్ఛందంగా సిసి కెమెరాల ఏర్పాటుకు పలువురు దాతలు ముందుకు
మొండికుంట గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని.ఎస్సై సర్పంచ్ సూచించడంతో కొంతమంది గ్రామ ప్రతినిధులు ప్రధాన రహదారికి ఇరువైపులా స్వచ్ఛందంగా సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకుంటామని ముందుకు రావడం జరిగింది. నేనే పద్యంలో మొండికుంట గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు.గ్రామంలో ఏటువంటి అవాంఛనీయ సంఘటనలకు ,దొంగతనాలకు తావు లేకుండా గ్రామాన్ని ,గ్రామ ప్రజలను సంరక్షించుకోవాల్సిన భాధ్యత గ్రామ పంచాయితీ పాలక వర్గం తో పాటు ప్రతి పౌరుని మీద ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్,కార్యదర్శి సైదులు, ఎంపిటిసి కమటం నరేష్, ఇంటిలిజెన్స్ ఏఎస్ఐ కాసరబాద శ్రీనివాస్, ప్యాక్స్ డైరెక్టర్ సందీప్, గ్రామ పెద్దలు కమటం వెంకటేశ్వరరావు, జాలే రామకృష్ణా రెడ్డి, మిట్టకంటి వెంకటరెడ్డి, ముస్కు శ్రీనివాస రెడ్డి,పాటి మన్మధ రెడ్డి, పాత్రికేయ మిత్రులు గోవర్ధనాచారి,సురేందర్ రెడ్డి,తూము సత్యనారాయణ,కందిమళ్ళ శ్రీధర్ రెడ్డి తోట అశోక్. పర్వత నరేష్ దండి నగేష్ మరియు గ్రామ యువత,గ్రామ పెద్దలు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !