మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
చతిస్గడ్ సంతలకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యాపారులు ఎవరు కూడా రావద్దని వారికి అనుమతులు లేవని చతిస్గడ్ రాష్ట్ర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అసలు విషయానికి వస్తే దుమ్ముగూడెం మండలం సరిహద్దు చతిస్గడ్ రాష్ట్రానికి మానుకొని ఉన్న ధర్మపేట కిష్టారం గొల్లపల్లి బూరులంక దుప్పి మరక పుటుకుపల్లి గ్రామంలో జరిగే వారపు సొంత లకు దుమ్ముగూడెం మండలానికి చెందిన వ్యాపారస్తులు ఎవరు కూడా రావద్దని రాష్ట్ర పోలీసులు తెలిపారు ఈనెల 17వ తేదీన లక్ష్మీనగరం గ్రామానికి చెందిన సంతల వ్యాపారి మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తూ వారికి ఇన్ ఫార్మర్ గా వ్యవహరించాడు దీనిలో భాగంగా తనని 17 తేదీన కిష్టారం పోలీస్ స్టేషన్లో అదుపులో తీసుకొని రాష్ట్ర పోలీస్ వారు విచారించి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని తేలడంతో అనంతరం 21 తేదీన అరెస్టు చేశారు దీనిలో భాగంగా మండలానికి చెందిన కొందరు వ్యాపారస్తులు మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారని అనుమానంతో దీనిని తెలంగాణ నుంచి వచ్చే సంతల వ్యాపారస్తులను మచ్చిక చేసుకుని వారితో సరకులు, సమాచారాలు అందిస్తారని అనుమానంతో ఎవరిని సంతలకు రావద్దని రాష్ట్ర పోలీస్ అధికారులు సూచన మేరకు ఆదేశాలను జారీ చేశారు.