UPDATES  

 కల్లుగీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే..

కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ బీమా ద్వారా.. కల్లగీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోతే, ఆ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం ప్రభుత్వం నుంచి అందుతుంది. నేరుగా వారి ఖాతాలోకే ఆ డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా సీఎం చెప్పారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాల్సిందిగా రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌ను, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం ఆదేశించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !