ఉద్యమ క్షేత్రంలో.. బాలింతల కష్టాలు
* తల్లుల పోరాటానికి మేము సైతం…
* ఇటు ఉద్యమం అటు పిల్లల యోగక్షేమాలు
మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్ :
పదహారెళ్ళుగా ప్రభుత్వానికి ప్రజలకు సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ రెండో ఏఎన్ఎంలు నిరవధిక సమ్మె ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సమ్మె సందర్బంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌకులో సిబ్బంది నిరసన శిభిరాన్ని ఏర్పాటు చేసుకొని వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బాలింతలైన రెండో ఏఎన్ఎం మహిళా సిబ్బంది తమ చంటి పిల్లలకు ఆ ఉద్యమ క్షేత్రంలోనే తమ చంటి పిల్లలకు ఉగ్గుపాలుపడుతూ చెట్లకు వుయ్యాలలు కట్టి పిల్లలను లాలిస్తూనే పోరాటంలో తమ పాత్ర పోషించడం జరిగింది. మహిళా కష్టాలను ప్రభుత్వం గమనించి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.