ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించాలని హిందూ సంఘాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో శ్రీకృష్ణ జన్మస్థల వివాదంపై పురావస్తు నిపుణులు సర్వే చేయనున్నారు. మధురలోని శశి ఈద్గా దర్గాలో సర్వేలు నిర్వహించి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు.
