UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 వైకాపా యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్వల్ప అస్వస్థత

వైకాపా యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కర్నూలు లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణకు మద్దతుగా జరిగిన సభలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులు మరియు కార్యకర్తల సమక్షంలో బైరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గర్జన సభ వేదిక నుండి పిలుపునిచ్చారు. ఆ సమయంలోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్వస్థ అస్వస్థతకు గురయ్యారు.

సభ వేదిక ముందు కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆయనకు వెంటనే పక్కన ఉన్న వైకాపా నాయకులు మరియు సన్నిహితులు సపర్యలు చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని పేర్కొన్నారు. పని ఒత్తిడి కారణంగా అస్వస్థతకు గురయ్యారంటూ సన్నిహితులు చెప్తున్నారు. బైరెడ్డి ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయన నివాసంకు చేరుకున్నారు. ఏం జరిగిందో అంటూ ఆందోళనతో ఉన్న వారికి ఆయన కుటుంబ సభ్యులు బైరెడ్డి యొక్క యోగ క్షేమాలను తెలియజేసినట్లుగా సమాచారం అందుతోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !