UPDATES  

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గర్జన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గర్జన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. రాయలసీమ మేధావులు మరియు ప్రజా సంఘాల సభ అన్నట్లుగా ప్రచారం జరిగినా కూడా పూర్తిగా వైకాపా శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు మరియు వైకాపా ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం ను సక్సెస్ చేసేందుకు స్థానిక నేతలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు.

మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు అంతా కూడా ఈ మీటింగ్ కి హాజరు అవ్వాలి అంటూ వైకాపా నేతల నుండి సందేశాలు వెళ్ళాయట. డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు ఈ మీటింగ్ కి హాజరు కాకపోతే ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున ఫైన్ పడుతుంది అంటూ కూడా సంఘాల ప్రతినిధులకు మెసేజ్ లు వెళ్లాయి అంటూ విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని వైకాపా శ్రేణులు మాత్రం కొట్టి పారేస్తున్నారు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. రాయలసీమ గర్జన పార్టీలకు అతీతంగా జరిగింది అంటూ వైకాపా నాయకులు మరియు ఇతర సభ నిర్వాహకులు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !