UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గర్జన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గర్జన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. రాయలసీమ మేధావులు మరియు ప్రజా సంఘాల సభ అన్నట్లుగా ప్రచారం జరిగినా కూడా పూర్తిగా వైకాపా శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు మరియు వైకాపా ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం ను సక్సెస్ చేసేందుకు స్థానిక నేతలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు.

మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు అంతా కూడా ఈ మీటింగ్ కి హాజరు అవ్వాలి అంటూ వైకాపా నేతల నుండి సందేశాలు వెళ్ళాయట. డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు ఈ మీటింగ్ కి హాజరు కాకపోతే ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున ఫైన్ పడుతుంది అంటూ కూడా సంఘాల ప్రతినిధులకు మెసేజ్ లు వెళ్లాయి అంటూ విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని వైకాపా శ్రేణులు మాత్రం కొట్టి పారేస్తున్నారు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. రాయలసీమ గర్జన పార్టీలకు అతీతంగా జరిగింది అంటూ వైకాపా నాయకులు మరియు ఇతర సభ నిర్వాహకులు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !