UPDATES  

 UPSC సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్స్‌)-2022 ఫలితాలు విడుదల

యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్) సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్‌ ఫలితాలు మంగళవారం (డిసెంబర్‌ 6)న విడుదలయ్యాయి. మెయిన్స్‌ రాత పరీక్షకు హాజరైనవారు అధికారిక వెబ్‌సైట్‌upsc.gov.in లేదా upsconline.nic.inలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ రాత పరీక్షలు సెప్టెంబర్‌ 16 నుంచి 25 వరకు మొత్తం పది రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు.

మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు తదుపరి దశ అయిన ఇంటర్వ్యూకి హాజరవవచ్చు. అనంతరం.. మెయిన్స్‌, ఇంటర్వ్యూలలో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితా విడుదల అవుతుంది. ఉత్తమ ర్యాంక్‌ సాధించిన వారు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ ఇతర సెంట్రల్‌ సర్వీసులకు ఎంపికవుతారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !