UPDATES  

 BBC ప్రభావశీలురైన మహిళల లిస్ట్‌లో PRIYANKA CHOPRA, SHIRISHA BANDLA

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన నటి ప్రియాంకా చోప్రా. సింగర్, యాక్టర్ అయిన నిక్‌ జొనాస్‌ను పెళ్లి చేసుకొని ఆమె లాస్‌ ఏంజిల్స్‌లోనే సెటిలైపోయింది. తాజాగా బీబీసీ 2022కుగాను రిలీజ్‌ చేసిన 100 మంది ప్రభావశీలురైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ లిస్ట్‌లో మొత్తం నలుగురు భారతీయులు ఉండగా.. అందులో బాలీవుడ్‌ నుంచి ప్రియాంకాకు మాత్రమే చోటు దక్కింది. ఇక స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన మన తెలుగు వనిత, ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ శిరీష బండ్ల, బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న రచయిత్రి గీతాంజలి శ్రీ, సోషల్‌ వర్కర్‌ స్నేహ జవాలే కూడా ఇందులో ఉన్నారు. బాలీవుడ్‌లో 60కిపైగా సినిమాలతో పెద్ద ఫిల్మ్‌ స్టార్‌లలో ఒకరిగా ఆమెను అభివర్ణించారు. “2022లో ప్రియాంకా తన యాక్టింగ్ కెరీర్‌ ప్రారంభించింది.

ఇక 2015లో అమెరికన్‌ నెట్‌వర్క్ డ్రామా సిరీస్‌ క్వాంటికోలో లీడ్‌ రోల్‌ పోషించిన తొలి దక్షిణాసియా మహిళగానూ నిలిచింది. ఆ తర్వాత ఈజ్‌ ఇంట్‌ ఇట్‌ రొమాంటిక్‌, ది మాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌లాంటి సినిమాల్లోనూ నటించింది. సొంతంగా ఓ ప్రొడక్షన్‌ కంపెనీ ప్రారంభించి ఇండియాలో సినిమాలు కూడా తీస్తోంది” అని బీబీసీ తెలిపింది. ఈ 100 మంది లిస్ట్‌లో మన తెలుగు వనిత శిరీష బండ్లకు కూడా చోటు దక్కడం గమనార్హం. వర్జిన్‌ గెలాక్టిక్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా చేస్తున్న ఆమె.. ఆ సంస్థ ఛైర్మన్‌ బ్రాన్సన్‌తో కలిసి స్పేస్‌లోకి వెళ్లి వచ్చింది. గుంటూరుకు చెందిన ఆమె.. చిన్నతనంలోనే అమెరికాలోని హూస్టన్‌కు వెళ్లింది. అక్కడే ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివి వర్జిన్‌ గెలాక్టిక్‌లో పని చేస్తోంది. గతేడాది జులై 11న ఆమె మరో ఐదుగురితో కలిసి వర్జిన్‌ గెలాక్టిక్‌కు చెందిన యూనిటీ 22 టెస్ట్‌ ఫ్లైట్‌లో స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !