UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 . సుమారు 140 స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాల్నీ తల్లకిందులు చేస్తూ బీజేపీ ఘనవిజయం సాధించబోతోంది. ఫలితాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా, ఆ పరిస్థితి లేదు. బీజేపీ అనూహ్యంగా దుమ్మురేపుతోంది. మరోమారు బీజేపీలో అధికారాన్ని దక్కించుకోబోతోంది. నిజానికి, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రభావం చూపొచ్చనే అభిప్రాయం గతంలో రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపించింది. ఢిల్లీ, పంజాబ్ తరహాలో గుజరాత్‌లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటుతుందని అంతా అనుకున్నారు. బీజేపీకి తిరుగులేదంతే.. వరుసగా ఏడోసారి బీజేపీ గుజరాత్‌లో అధికారంలోకి వచ్చేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఈసారి మరింత బంపర్ విక్టరీ బీజేపీ నమోదు చేయబోతోంది. సుమారు 140 స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం చూపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 20 స్థానాలకే పరిమితమయ్యేలా వుంది. ఆమ్ ఆద్మీ పార్టీ డబుల్ డిజిట్ చేరుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ‘గుజరాత్ భూమి పుత్ర మోడీ’ అనే నినాదం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ప్రభావమే చూపినట్లు కనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీ సాధిస్తే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ దేశంలో బీజేపీదే విజయమనే భావన రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమయిన దరిమిలా, ముచ్చటగా మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి రాబోతోందన్నమాట.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !