UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 ‘మాకు రీమేక్ వద్దు.. ఒరిజినల్ సబ్జెక్ట్ కావాలి’ అంటూ హరీష్‌కి విజ్ఞప్తి

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాని గతంలో అనౌన్స్ చేసింది. అయితే, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది. కాగా, పవన్ కళ్యాణ్‌తో చేయబోయే సినిమాపై అప్డేట్ రాబోతోందంటూ తాజాగా హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. అంతే, పవన్ అభిమానుల్లో అలజడి బయల్దేరింది. రీమేక్ చేయొద్దంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు సూచనలతో కూడిన హెచ్చిరకలు చేస్తున్నారు.

‘తెరీ’ రీమేక్ చేస్తున్నారా..? విజయ్, సమంత ప్రధాన పాత్రల్లో వచ్చిన తమిళ సినిమా ‘తెరి’ తెలుగులోకి ‘పోలీసోడు’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. దాన్నే రీమేక్ చేయబోతున్నారన్నది జరుగుతున్న ప్రచారం. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ‘మాకు రీమేక్ వద్దు.. ఒరిజినల్ సబ్జెక్ట్ కావాలి’ అంటూ హరీష్‌కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఓ అభిమాని అయితే ఏకంగా సూసైడ్ లెటర్ రాసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నా చావుకి కారణం దర్శకుడు హరీష్ శంకర్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్’ అని అందులో పేర్కొన్నాడు ఆ అభిమాని. మరి, హరీష్ ఈ విషయమై ఎలా స్పందిస్తాడో.!

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !