UPDATES  

 ‘పుష్ప ది రూల్’ విషయమై ఆచి తూచి అడుగెయ్యాలన్నది మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచన.

అల్లు అర్జున్, రష్మిక మండన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘పుష్ప ది రైజ్’ సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ ‘పుష్ప ది రైజ్’కి కొనసాగింపు అయిన ‘పుష్ప ది రూల్’ ఎలా వుండబోతోంది.? ఈ విషయమై హీరోయిన్ రష్మిక మండన్న ఓ చిన్న హిట్ ఇచ్చింది. మొదటి పార్ట్‌కీ, రెండో పార్ట్‌కీ కొన్ని తేడాలుంటాయని చెప్పుకొచ్చింది. ప్రధానంగా లుక్స్ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నారట. లుక్స్ మార్చితే ఎలాగబ్బా.? పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ , శ్రీవల్లి పాత్రలో రష్మిక మండన్న నటించారు.

పెళ్ళి దగ్గర ఆ ‘పుష్ప ది రైజ్’ కథ ఆగింది. దానికి కొనసాగింపు గనుక, గెటప్స్‌లో మార్పులు ఎలా వుంటాయబ్బా.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. Some Changes Are Being Made In Getups For Pushpa 2 రష్మిక మాత్రం మార్పులుంటాయని అంటోంది. అయితే, అవి మరీ పెద్ద మార్పులు కావట. ఆ మార్పులేంటో తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందేనని చెబుతోంది రష్మిక మండన్న. అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. ప్రస్తుతం పుష్ప టీమ్, రష్యాలో విడుదలైన ‘పుష్ప ది రైజ్’ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !