UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 ‘పుష్ప ది రూల్’ విషయమై ఆచి తూచి అడుగెయ్యాలన్నది మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచన.

అల్లు అర్జున్, రష్మిక మండన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘పుష్ప ది రైజ్’ సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ ‘పుష్ప ది రైజ్’కి కొనసాగింపు అయిన ‘పుష్ప ది రూల్’ ఎలా వుండబోతోంది.? ఈ విషయమై హీరోయిన్ రష్మిక మండన్న ఓ చిన్న హిట్ ఇచ్చింది. మొదటి పార్ట్‌కీ, రెండో పార్ట్‌కీ కొన్ని తేడాలుంటాయని చెప్పుకొచ్చింది. ప్రధానంగా లుక్స్ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నారట. లుక్స్ మార్చితే ఎలాగబ్బా.? పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ , శ్రీవల్లి పాత్రలో రష్మిక మండన్న నటించారు.

పెళ్ళి దగ్గర ఆ ‘పుష్ప ది రైజ్’ కథ ఆగింది. దానికి కొనసాగింపు గనుక, గెటప్స్‌లో మార్పులు ఎలా వుంటాయబ్బా.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. Some Changes Are Being Made In Getups For Pushpa 2 రష్మిక మాత్రం మార్పులుంటాయని అంటోంది. అయితే, అవి మరీ పెద్ద మార్పులు కావట. ఆ మార్పులేంటో తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందేనని చెబుతోంది రష్మిక మండన్న. అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. ప్రస్తుతం పుష్ప టీమ్, రష్యాలో విడుదలైన ‘పుష్ప ది రైజ్’ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !