UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 వైసీపీ ప్రభుత్వం నోరెత్తకుండా సమైక్య రాష్ట్రం ప్రకటనలు

ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వైసీపీ ప్రభుత్వం నోరెత్తకుండా సమైక్య రాష్ట్రం ప్రకటనలు చేయడం మోసపూరితమైన ప్రయత్నమని చంద్రబాబు అన్నారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘ఏపీలో అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. టీడీపీ హయాంలో వ్యవసాయం వృద్ధి, ఆక్వా ఎగుమతుల్లో రికార్డులు సృష్టిస్తే.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 1673 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు వ్యతిరేక విధానాలు, మద్ధతు ధర లేకపోవడం, వ్యవసాయ సబ్సీడీలు నిలిచిపోవడమే కారణం.

టెర్రరిజం తరహాలో ప్రజలపై వేధింపులు, కక్ష సాధింపులకు పాల్పడటంతో సామాన్యులు సైతం ప్రాణాలు తీసుకుంటున్నారు’. ‘ఇన్ని సమస్యలతో ప్రజలు ఉంటే తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతా రాహిత్యంగా ప్రకటనలు చేస్తోంది. రెండు రాష్ట్రాలను కలపాలంటూ గందరగోళంలోకి నెడుతోంది. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ సమైక్య రాష్ట్రం అంటూ ప్రజలను మభ్యపెడుతోంది. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది’ అని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !