UPDATES  

 వైసీపీ ప్రభుత్వం నోరెత్తకుండా సమైక్య రాష్ట్రం ప్రకటనలు

ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వైసీపీ ప్రభుత్వం నోరెత్తకుండా సమైక్య రాష్ట్రం ప్రకటనలు చేయడం మోసపూరితమైన ప్రయత్నమని చంద్రబాబు అన్నారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘ఏపీలో అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. టీడీపీ హయాంలో వ్యవసాయం వృద్ధి, ఆక్వా ఎగుమతుల్లో రికార్డులు సృష్టిస్తే.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 1673 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు వ్యతిరేక విధానాలు, మద్ధతు ధర లేకపోవడం, వ్యవసాయ సబ్సీడీలు నిలిచిపోవడమే కారణం.

టెర్రరిజం తరహాలో ప్రజలపై వేధింపులు, కక్ష సాధింపులకు పాల్పడటంతో సామాన్యులు సైతం ప్రాణాలు తీసుకుంటున్నారు’. ‘ఇన్ని సమస్యలతో ప్రజలు ఉంటే తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతా రాహిత్యంగా ప్రకటనలు చేస్తోంది. రెండు రాష్ట్రాలను కలపాలంటూ గందరగోళంలోకి నెడుతోంది. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ సమైక్య రాష్ట్రం అంటూ ప్రజలను మభ్యపెడుతోంది. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది’ అని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !