UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 వైకాపా సమైక్యాంధ్ర ప్రకటనపై స్పందన….ఆయన చేసిన వ్యాఖ్యలు విడ్డూరం

ఇటీవల వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సమైక్యాంధ్ర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇప్పుడు వైకాపా ది సమైక్యాంధ్ర నినాదం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కుదిరితే ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలను ఏకం చేయాలి అనేది మా కోరిక అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సమైక్య రాష్ట్రంపై ప్రకటనలా అంటూ మండిపడ్డాడు. సమైక్య రాష్ట్రం పేరు చెప్పి ప్రజలను మళ్లీ మభ్య పెట్టడం మోసపూరితమవుతుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో రైతుల పెరగడం ఆందోళనకరంగా ఉందని టిడిపి హహంలో వ్యవసాయ రంగంలో రికార్డు సాధించామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైసీపీ రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన తప్పులను ప్రభుత్వ పెద్దలను సరిదిద్దుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నాడు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా వ్యవహరించాలి కాని సమైక్య నినాదం ఎత్తుకొని ప్రజలను మభ్య పెట్టవద్దని బాబు ఎద్దేమో చేశాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !