UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 ఆగ్నేయ అరేబియా సముద్రంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనం

ఇటీవల సంంభవించిన మాండస్ తుఫాను దాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఇది తీరం దాటి బలహీనపడినప్పటికీ ఆ ప్రభావం మాత్రం ఇంకా తగ్గిపోలేదు. ఫలితంగా కోస్తాంధ్రతో పాటు రాయలసీమ, ఉత్తర తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.

ఆగ్నేయ అరేబియా సముద్రంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా, ఇది మరింతగా బలపడి గురువారానికి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదిలావుంటే, బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలని సుమిత్ర జలసంధిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడివుంది. ఇది వచ్చే రెండు మూడు రోజుల్లో పశ్చిమంగా పయనించి శ్రీలంకకు సమీపంలో ఈ వారాంతంలో అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !