UPDATES  

 ఎన్టీయార్‌తో రష్మిక రొమాన్స్

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా నటించనున్న సినిమాకి హీరోయిన్ ఎవరు.? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, ఎన్టీయార్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించి వుండేది. కానీ, ‘ఆచార్య’ ఫ్లాప్ నేపథ్యంలో ఎన్టీయార్ – కొరటాల శివ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం తీసుకుంది. సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది.? అన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే వుంది. రష్మికకి గోల్డెన్ ఛాన్స్.

తాజాగా ఈ సినిమా కోసం రష్మిక పేరు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలో అనౌన్స్ చేయబోతోందిట. ఎట్టి పరిస్థితుల్లోనూ జాన్వీ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదనీ, అందుకే రష్మికని చిత్ర యూనిట్ సంప్రదించి ఓకే చేసిందని అంటున్నారు. రష్మిక ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప ది రూల్’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. సంక్రాంతికి రష్మిక నటించిన ‘వారిసు’ విడుదల కాబోతోంది. తెలుగులో దీన్ని ‘వారసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !