UPDATES  

 షారుక్, దీపిక దిష్టి బొమ్మల్ని తగలబెట్టేస్తున్నారు

షారుక్ ఖాన్, దీపికా పడుకొనే జంటగా నటించిన బాలీవుడ్ సినిమా ‘పఠాన్’ తెలుగులోనూ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి ‘బేషరమ్ రంగ్’ అనే పాటని విడుదల చేశారు. నిజానికి, చాలా నిస్సిగ్గుగా ఈ పాటని చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. సారుఖ్ ఖాన్, దీపికా పడుకొనేల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా చాలా వల్గర్‌గా తయారైంది. అయినా, ఈ తరహా పాటలు ఇటీవల సినిమాల్లో సర్వసాధారణమై పోయాయి.

షారుక్, దీపిక దిష్టి బొమ్మల్ని తగలబెట్టేస్తున్నారు.. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ సినిమాని బ్యాన్ చేయాలనే డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. కొందరు రాజకీయ నాయకులు ఈ సినిమాపై మండిపడుతున్నారు. అంతే కాదు, ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు షారుక్, దీపికల దిష్టిబొమ్మల్ని తగలబెడుతున్నారు. దీపిక బరి తెగించేసింది.. షారుఖ్ ఖాన్ అసభ్యకరంగా ప్రవర్తించాడన్నది ఆందోళనకారుల వాదన. అయితే, సినిమాని సినిమాలా చూడాలనీ.. నటీనటుల మధ్య కెమిస్ట్రీపై అసభ్యకరమైన వివాదాలు తెరపైకి తేవడం సబబు కాదనీ కొందరు సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. ఈ మధ్య ఏ సినిమాకైనాగానీ, ‘బ్యాన్’ అన్న వివాదం తప్పడంలేదు. బాలీవుడ్ అయితే ఈ ‘బ్యాన్’ నినాదంతో చాలా చాలా నష్టపోయింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !