UPDATES  

 ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ

తెలంగాణ రాజకీయాల్లో మరో కుదుపు.! తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారింది) ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో ఈడీ పేర్కొంది. పైలట్ రోహిత్ రెడ్డి అంటే, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఫామ్ హౌస్ వేదికగా ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం తెరపైకొచ్చిన కేసులో కీలక వ్యక్తి. పైలట్ రోహిత్ రెడ్డి కి చెందిన ఫామ్ హౌస్‌లోనే బేరసారాలు జరిగాయి. డ్రగ్స్ కేసులో నోటీసులు.. పైలట్ రోహిత్ రెడ్డితో తొలుత ముగ్గురు వ్యక్తులు సంప్రదింపులు జరిపారు. \

ఆయన వెంట మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వస్తారని సదరు ముగ్గురు వ్యక్తులు భావించారు. అయితే, పైలట్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆ సమాచారాన్ని అధినేత కేసీయార్‌కి చేరవేశారు. అలా ఆ వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డి హీరో అయిన సంగతి తెలిసిందే. కాగా, పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడం గమనార్హం. ‘మేం బీజేపీ ప్రతిపాదనల్ని తిరస్కరించాం.. మా మీద కేసులు నమోదవుతాయ్.. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థల్ని రంగంలోకి దించి, మాపై దాడి చేయిస్తారు..’ అంటూ గతంలోనే పైలట్ రోహిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకు అనుగుణంగానే ఈ నోటీసులు వచ్చాయని గులాబీ నేతలు అంటున్నారు. ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !