UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో

సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారా.? కాంగ్రెస్ పార్టీలో అస్సలేమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టిని వీడటం దాదాపు ఖాయమైపోయిందా.? తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీని ఓ ఎంపీ స్థాయిలో కలిశానంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి . తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ మార్పు ఊహాగానాల గురించి మాట్లాడేందుకు నిరాకరించారు.

ఎన్నికలకు చాలా సమయం వుంది.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడతాననీ, ప్రస్తుతం తనను గెలిపించిన ప్రజల అభివృద్ధి కోసమే తాను పని చేస్తాననీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి, మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు వెంకటరెడ్డి పిలుపునివ్వడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. ఈ విషయమై షోకాజ్ నోటీసులు అందుకున్న వెంకటరెడ్డి, వివరణ అయితే ఇచ్చారుగానీ, ఆ తర్వాత నుంచి ఆయన్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం మానేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !